Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్యతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. అది అలా ఉంటే చిరంజీవి మరోసారి సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది.
వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్గా చేస్తోంది. ఇక మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు
అది అలా ఉంటే చిరంజీవి మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ తన కెరీర్ 156వ సినిమాని బంగార్రాజు మూవీతో మంచి విజయాన్ని అందుకున్న కళ్యాణ్ కృష్ణతో చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథను సమకూర్చుతుండగా.. చిరంజీవి కూతురు సుష్మిత నిర్మిస్తోంది
అయితే ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో యువ హీరో సిద్దు జొన్నల గడ్డ నటిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్దుకు జోడిగా శ్రీలీల నటించనుందట . ఈ సినిమా మలయాళీ సినిమా బ్రోడాడీకి రీమేక్ అని లేటెస్ట్ టాక్.. అయితే ఈ సినిమా ఇప్పటికే మొదలైందని.. సంక్రాంతి బరిలో విడుదలకు రెడీ అవుతోందని తెలుస్తోం
మహేష్ బాబు సినిమా గుంటూరు కారం సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతుండడంతో ఈ సినిమా ఇక సంక్రాంతిలో ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి సంక్రాంతి బరిలోకి వస్తున్నారట. కళ్యాణ్ కృష్ణతో వచ్చే సినిమాతో చిరంజీవి వచ్చే సంక్రాంతి రేసులో దిగుతున్నారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో
క చిరంజీవి మరో సినిమాను కూడా ఓకే చేశారట. తన 157వ సినిమాని బింబిసార దర్శకుడు వశిష్టతో చేస్తున్నట్లు టాక్. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కించనున్నారు. సోషియో ఫాంటసీగా వస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు జవాన్ ఫేమ్ దర్శక,రచయిత బి.వియస్ రవి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది
వీటితో పాటు ఓ తమిళ దర్శకుడికి కూడా చిరంజీవి ఓకే అన్నారని టాక్. మిత్రన్తో ఓ సినిమాకు ఓకే అన్నట్లు సమాచారం. వినాయక్తో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రీసెంట్గా రామ్ చరణ్ మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని వినాయక్ చేతిలో పెట్టడానికి ఓకే చెప్పినట్టు సమాచారం
గతంలో వినాయక్ చిరుతో తెరకెక్కించిన రెండు చిత్రాలు రీమేక్స్ కావడం వాటిని వినాయక్ అద్భుతంగా తెరకెక్కించి చిరుకు మంచి హిట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇవే కాకుండా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమాను కూడా చిరంజీవి ఓకే చేసినట్లు టాక్. చూడాలి మరి ఇందులో ఏ సినిమా ముందు రానుందో
ఇక చిరంజీవి లేటెస్ట్గా నటించిన వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ దర్శకత్వలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిరంజీవికెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకుపైగా వసూలు చేసి వావ్ అనిపించింది
ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్లో విడుదలైంది. ఫస్ట్ డే మిగితా ఏరియాలతో పోల్చితే నైజాంలో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఈ చిత్రం ఇప్పటికే అమెరికాలో టూ మిలియన్ మార్కును అధిగమించింది. దీంతో ఈ సినిమా చిరంజీవి కెరీర్లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. ఇంతకు ముందు 2 మిలియన్ అందుకున్న చిరంజీవి ఇతర సినిమాలు సైరా, ఖైదీ నెంబర్ 150లుగా ఉన్నాయి. ఈ సినిమా అక్కడ 2.5 మిలియన్ డాలర్స్ను అందుకుంది.
ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లి్క్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. వాల్తేరు వీరయ్యలో రవితేజ మరో కీలకపాత్రలో కనిపించారు.. ఈ సినిమాలో రవితేజ, విక్రమ్ సాగర్ అనే పోలీస్ పాత్రలో కేక పెట్టించారు.. తెలంగాణ యాసలో మాస్ మాహారాజా వావ్ అనిపించారు. రవితేజ ఇటీవల ధమాకా సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నసంగతి తెలిసిందే. ఆయనకు వాల్తేరు వీరయ్య రూపంలో మరో హిట్ పడింది..
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటంచారు. రవితేజ, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇక చిరు మరో సినిమా గాడ్ ఫాదర్.. ఈ సినిమా కూడా మంచి అంచనాల నడుమ వచ్చింది
ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో నటించి వావ్ అనిపించిన సంగతి తెలిసిందే. ఆయన చిన్నపాత్ర చేసిన అది.. హిందీలో మంచి కలెక్షన్లు రాబట్టడానికి ఎంతో ఉపయోగపడింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది
లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి తన నటనతో వావ్ అనిపించారు. ఈ సినిమాలో నయన్, చిరంజీవి చెల్లిగా కనిపించారు. గాడ్ ఫాదర్ మలయాళీ సినిమా లూసీఫర్కు తెలుగు రీమేక్గా వచ్చింది. అక్కడ ఈ సినిమాలో మోహన్ లాల్ నటించారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో చిత్రం ఆచార్య. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా నిలిచింది. చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది
సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. చిరంజీవి, రామ్ చరణ్లు నక్సల్స్ పాత్రల్లో కనిపించారు. ఇద్దరు నటన పరంగా బాగానే ఉన్న.. కథ, కథనం సరిగా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది.
Credit : https://telugu.news18.com/photogallery/movies/chiranjeevi-film-with-kalyan-krishna-to-be-released-for-sankranthi-here-are-the-details-sr-1906790-page-17.html