Yatra- 2: ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్లతో ట్రెండ్ అవుతున్న డైరెక్టర్ మహి వి.రాఘవ్.. ప్రస్తుతం యాత్ర- 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్లతో ట్రెండ్ అవుతున్న డైరెక్టర్ మహి వి రాఘవ్ (Mahi V Ragav).. ప్రస్తుతం యాత్ర- 2 (Yatra 2) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది. యాత్ర సినిమాకు ఇది కొనసాగింపుగా ఉంటుంది. గతంలో వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా రూపొందిన యాత్ర మూవీ సక్సెస్ కావడంతో అదే సినిమాకు సీక్వల్ గా ఈ యాత్ర 2 రూపొందిస్తున్నారు డైరెక్టర్ మహి వి.రాఘవ్.
వైఎస్ఆర్ మరణం నుంచి మొదలుకొని.. ఆయన కొడుకు వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు జరిగిన పరిస్థితులను ఈ యాత్ర 2లో చూపించబోతున్నారట. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఇందులో హైలెట్ కానుందని సమాచారం. దీంతో ఈ మూవీ కోసం వైసీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ యాత్ర 2పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మహి వి.రాఘవ్.
తాజాగా జూలై 8, 2023 అని మాత్రమే రాస్తూ ఓ ట్వీట్ చేశారు డైరెక్టర్ మహి వి.రాఘవ్. దీంతో ఈ ట్వీట్ వెనుక సీక్రెట్ ఏంటి అనే కోణంలో జనాలు డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే జూలై 8వ తేదీ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కాబట్టి ఆయన పుట్టిన రోజు సందర్భంగా యాత్ర 2కి సంబంధించి కీలక అప్డేట్ ఉండబోతుందనే విషయాన్ని మహి వి.రాఘవ్ ఇలా కన్ఫర్మ్ చేశారని చెప్పుకుంటున్నారు జనం. ఏది ఏమైనా ఒక్క చిన్న డేట్తో జనాల్లో క్యూరియాసిటీ పెంచడం అనేది ఇక్కడ మెయిన్ పాయింట్.
కాగా, ఈ యాత్ర 2లో వైఎస్ జగన్ రోల్ కీలకం కానున్న నేపథ్యంలో ఈ రోల్ ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే తమిళ నటుడు, రంగం ఫేమ్ జీవా ఈ రోల్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో సమాచారాలు వైరల్ అవుతున్నాయి. సో చూడాలి మరి.. జూలై 8న మహి వి.రాఘవ్ ఏం చెప్పబోతున్నారనేది!.
Credit : https://telugu.news18.com/news/movies/director-mahi-v-ragav-creates-buzz-on-yatra-2-movie-slb-1934388.html