WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Ram Charan : మెగా ఫ్యాన్స్‌కు షాక్.. గేమ్ ఛేంజర్‌కు దర్శకుడు మార్పు..

Ram Charan : రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేజంర్ అనే ఓ భారీ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా వచ్చే వేసవికి విడుదలకానున్నట్లు సమాచారం. అది అలా ఉంటే ఈ సినిమా విషయంలో ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్  తమిళ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే…  ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్నారు. అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. రీసెంట్‌గా లేటెస్ట్‌గా షెడ్యూల్ స్టార్ట్ అయింది. అది అలా ఉంటే ఈ సినిమా విషయంలో ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వస్తే.. ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్‌లు ‘హిట్ 2’ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేయనున్నారట. శంకర్‌ ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 బిజీలో ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది

ఈనేపథ్యంలో గేమ్ ఛేంజర్‌లోని కొన్ని సీన్స్‌ను శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారట. ఈ చిత్రంలో రామ్ చరణ్ లేని కొన్ని సీన్లను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటికే పలు కారణాల వల్ల ఆలస్యం అవ్వడంతో టీమ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 11 నుండి ప్రారంభమైంది. ప్రస్తుతం శంకర్ ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ షూట్‌లో రామ్ చరణ్ కూడా పాల్గోంటున్నారు. 

ఇక ఈ సినిమా  నుంచి  ఆమధ్య ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అది అలా ఉంటే RC15 వచ్చే వచ్చే సంవత్సరం సమ్మర్‌లో థియేట్రికల్ రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చి 21, 2024ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. .. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది

ఈమూవీని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు అనే వార్త ఎప్పటినుండో ప్రచారం అవుతోంది. అయితే అది పక్కాగా నిజమే అని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండవ పాత్రకి అంజలి జోడిగా కనిపించనుందట..

టీమ్ ఇటీవల ఓ పాటను చిత్రీకరిస్తుందట. ఈ పాటకు దాదాపుగా 5 కోట్లపైగా ఖర్చు చేశారట. అయితే ఈ పాట కోసం రామ్ చరణ్ చేసిన 80 సెకన్ల డాన్స్ సినిమాకు హైలెట్‌గా ఉండనుందని తెలుస్తోంది. సింగిల్ టేక్‌లో రామ్ చరణ్ అదరగొట్టేశారనీ.. చరణ్ డాన్స్‌కు శంకర్ ఫిదా అయ్యారని, థియేటర్స్‌లో ఈ మూమెంట్ కన్నుల పండగగా ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో సీనియర్ నటి ఖుష్బూ నటించనుందట. సెకండ్ హాఫ్‌లో ఓ కీలకమైన సన్నివేశంలో నటి ఖుష్బూ కనిపించనుందని తెలుస్తోంది. ఈ పాత్ర ఈ సినిమా మొత్తంలోనే చాలా కీలకం అని సమాచారం. ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌.. రామ్ చరణ్ డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా కనిపంచనుండగా.. మరో పాత్రలో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది

మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా విషయంలో మొదటి నుంచి లీకులు మాత్రం తప్పడం లేదు. ఇప్పటికే  ఓ వీడియో, ఫోటోలు లీక్ అవ్వగా.. ఇక తాజాగా మరికొన్ని లీక్ అయ్యినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని సార్లు హెచ్చరించినా కూడా కొన్ని ఫోటోలు లీక్ అవుతున్నాయి

గతం రామ్ చరణ్ రిక్షా తొక్కుకుంటూ తెల్లని దుస్తుల్లో ఒక కామన్ మ్యాన్ కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇక మరో ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మాత్రం పంచ కట్టులో తన భార్య కొడుకుతో కనిపిస్తూ ఉన్నారు. ఈ ఫోటోను బట్టి చూస్తుంటే.. రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రిగానూ అలాగే ఆ తర్వాత కొడుకు గానూ కనిపిస్తాడని, రెండు పాత్రల్లో చరణ్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక అంజలి ఈ సినిమాలో సీనియర్ రామ్ చరణ్‌కు భార్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో దర్శకుడు. నటుడు ఎస్ జే సూర్య నటించనున్నారట. దీనికి సంబంధించి టీమ్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ భారీ సినిమాలో చరణ్ సరసన హిందీ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ డిమాండ్ పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్‌ రైట్స్ కోసం 45 కోట్లకి పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. ఇక దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు.. 

ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే… ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది

ఇక రామ్ చరణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన తన 16 వ సినిమాను  ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమాను కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్‌లో మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. రెహమాన్ సంగీతం అందించనున్నారట. ఇతర టెక్నికల్ విషయాలను త్వరలో ప్రకటించనుంది టీమ్.

మరోవైపు రామ్ చరణ్ త్వరలో రామాయణం సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రామాయణం ఆధారం పలు సినిమాలు రాగా.. ఇక లేటెస్ట్‌గా రామ్ చరణ్.. శ్రీరాముడిగా ప్యాన్ ఇండియా స్థాయిలో మరో రామాయణం రానుందని అంటున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవిని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాకు దంగల్ ఫేమ్ నితీస్ తివారి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే రామాయణం తీస్తున్నట్లు ప్రకటించారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..

ఇక రామ్ చరణ్ లైనప్ విషయానికి వస్తే.. శంకర్ సినిమాతో పాటు లోకేష్ కనకరాజ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా, సుకుమార్‌తో మరో సినిమా ఇలా భారీగా ప్లాన్ చేశారు రామ్ చరణ్.. ఇవన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే. వీటితో పాటు ఆయన మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. మఫ్టీ చిత్రంతో కన్నడ చిత్రసీమలో మంచి పేరు తెచ్చుకున్న నర్తన్ తో రామ్ చరణ్ ఓ చిత్రాన్నియనున్నారట. ఈ విషయంలో అతి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియందికాదు. ఈ సినిమా గత ఏడాది మార్చిలో విడుదలై కలెక్షన్స్ పరంగానే కాకుండా రివార్డ్‌లు అవార్డ్‌ల పరంగా అదరహో అనిపిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఈ సినిమా ఆస్కార్ అవార్డ్‌ కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఇక ఈ మూవీ నుండి కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలవడమే కాదు విజేతగా నిలిచి ఆస్కార్ అవార్డ్ అందుకుంది.

Credit : https://telugu.news18.com/photogallery/movies/ram-charan-game-changer-update-director-sailesh-kolanu-to-direct-some-portions-of-the-movie-here-are-the-details-sr-1963670-page-17.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *